telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్

Minister Lokesh comments YS Jagan

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రజలపై పడ్డారు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలను హత్య చెయ్యడం, వారు ఇళ్ల నుండి బయటకి రాకుండా గోడలు కట్టడం, వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

‘కర్నూలు జిల్లా కాల్వబుగ్గ గ్రామస్తులు తాగునీరు ఇవ్వండని వేడుకున్నారు. ఫలితం లేకపోయేసరికి గ్రామస్తులే బోర్ రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ మాత్రం దానికే కత్తులు, కొడవళ్లతో వైసీపీ నాయకులు దాడులకు దిగి ప్రజల తలలు పగలగొట్టారు’ అని లోకేశ్ ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts