telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారు: యనమల

Yanamala tdp

కరోన నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లించిందని టీడీపీ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకాల వల్ల వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమవుతోందిన ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఆదేశాలను రాష్ట్రం బేఖాతరు చేస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వ బరితెగింపు విధానాలకు కళ్లెం వేయాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్‌గా చేశారని యనమల వ్యాఖ్యానించారు.

Related posts