కరోనా బారి నుంచి అర్చకులను కాపాడడంలో టీటీడీ విఫలమైందని తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. కోవిడ్ కారణంగా మృతి మాజీ ప్రధాన అర్చకుడు మరణించారని చెప్పారు. మరో 45 ఏళ్ల జూనియర్ అర్చకుడు స్వామికి సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వీరిని కాపాడంలో టీటీడీ విఫలమైందని అన్నారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా రమణ దీక్షితులు స్పందించారు. మాజీ ప్రధాన అర్చకుడితో పాటు విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం జగన్, చైర్మన్ సుబ్బారెడ్డికీ విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఆ రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.