మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజును రాయ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నాథూరామ్ గాడ్సేను అభినందిస్తూ కాళీచరణ్ మహరాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోకు 25 కి.మీ దూరంలోని బాగేశ్వర్ దామ్ సమీపంలో ఓ అద్దె ఇంటిలో ఉన్న కాళీచరణ్ మహరాజ్ను గురువారం తెల్లవారు జామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు రాయ్పుర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
ఇటీవల రాయ్పూర్ వేదికగా ధరమ్ సన్సద్ అనే ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కాళీచరణ్.. జాతిపిత మహాత్మా గాంధీని దూషించి, గాంధీని చంపిన గాడ్సేపై పొగడ్తల వర్షం కురిపించాడు.
అంతేకాకుండా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశాడని.. అతన్ని చంపిన నాథూరామ్ గాడ్సేకు శతకోటి వందనాలు అని కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహంత్ రామ్ సుందర్ దాస్ ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేదిక దిగి వెళ్లిపోయారు.ఆయన వెళ్లిపోవడం, కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన రాయ్పూర్ పోలీసులు గురువారం ఉదయం కాళీచరణ్ ని అరెస్ట్ చేసి.. ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ