telugu navyamedia
రాజకీయ వార్తలు

బాబ్రీ మసీదు కేసు తీర్పు..జై శ్రీరామ్ అంటూ అద్వానీ హర్షం

Lk advani Bjp

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు న్యాయస్థానం ఈ కేసులోని నిందితులందరూ నిర్దోషులేనని న్యాయస్థానం ప్రకటించింది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని పేర్కొంది. నిందితులు కుట్రకు పాల్పడ్డారనే ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.

తమను నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో నిందితులలో ఒకరైన బీజేపీ కురువృద్ధుడు అద్వానీ స్పందిస్తూ, ‘జై శ్రీరామ్’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించి బీజేపీతో పాటు, తన వ్యక్తిగత నిబద్ధతను కోర్టు తీర్పు ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

Related posts