telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దళిత యువకుడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి: నారా లోకేశ్

Nara Lokesh

ప్రకాశం జిల్లాలో మాస్కు వేసుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటనపై న టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ వద్ద దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను మాస్క్‌ పెట్టుకోలేదంటూ పోలీసులు కొట్టడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని లోకేశ్ డిమాండ్ చేశారు

మాస్కు వేసుకోలేదని బంగారు భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు కిరణ్ ని కొట్టి చంపేశారు. ఇప్పుడు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిష్పక్షపాతమైన ఎంక్వయిరీ జరగాలి. శిరోముండనం, కొట్టి చంపడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts