telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీపీసీసీ పదవి జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్నచిన్న అలకలు సహజమేనని అన్నారు. టీ-పీసీసీ ప్రకటించాక లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్‌లోని చిన్న వ్యత్యాసం మాత్రమే తమ మధ్య ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారని సంజయ్‌ కలలు కంటూనే ఉండాలని.. కాంగ్రెస్ వాళ్లు చేరుతారని చెప్పడం బీజేపీ బలహీనంగా ఉందని ఒప్పుకోవడమేనని అన్నారు. రాష్ట్రం ఇచ్చి కేసీఆర్‌తో కాంగ్రెస్ మాటలు పడాల్సివస్తోందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచిపోయారని.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, మైనారిటీ, ఎస్టీల రిజర్వేషన్ పెంచ లేదని జగ్గారెడ్డి విమర్శించారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం లేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఈ అధికారుల సంగతి చూస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కొల్లూర్‌లో బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు గూర్ఖాలకంటే అధ్వాన్నంగా పనిచేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

Related posts