మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా తాలుకానే, ఎంపీ మిథున్ రెడ్డి మా బంధువే.. రూ.5 లక్షలిస్తే డైరెక్ట్గా పంచాయతీ కార్యదర్శి పోస్ట్ ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పలువురిని నమ్మించాడు. ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ మున్సిపల్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పోరుమామిళ్ల రమేశ్బాబు.. రూ.5 లక్షలు ఇస్తే పంచాయతీ కార్యదర్శి పోస్టు ఇప్పిస్తానని ఇదే జిల్లాకు చెందిన అమ్మద్ అనే వ్యక్తిని ఫోన్లో నమ్మించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ ఇదే తరహా ప్రచారానికి తెరదీశాడు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రమేశ్బాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.