*వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు..
*టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలదే అధికారం
*మంత్రులు బస్సు యాత్రలో వస్తుంది..అలీబాబా 40 దొంగలు
వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదని, టీడీపీ ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ బస్సు యాత్రపై ఘాటు విమర్శలు, ఆరోపణలు చేశారు.
వైసీపీ చేపడుతోన్న బస్సు యాత్రలో వస్తున్నది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలని అన్నారు. మూడేళ్లలో ఏం చేశారని ప్రజల్లోకి వస్తున్న వైసీపీ మంత్రుల్ని ప్రజలు నిలదీయాలి అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
జగన్ సర్కార్ టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలపై తప్పుడు కేసులను ఒక్క సంతకంతో ఎత్తేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలదే అధికారమని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం వైసీపీ పాలనలో ఇబ్బంది పడిన కార్యకర్తలతోనే శిక్ష విధించేలా న్యాయబద్దమైన చట్టబద్దమైన అధికారాలు తెప్పిస్తామన్నారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని.. సాధారణ కార్యకర్త వరకూ చాలా ఇబ్బందులు పడ్డారు. టీడీపీని లేకుండా చేయడం జగన్.. తాత, తండ్రి వల్ల కూడా కాలేదు..చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేశారు.
రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీని జగన్ ఏమీ చేయలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీని జగన్ ఏం చేయలేరని అన్నారు
గతంలో జరుపుకున్న మహానాడుకు ఈమహానాడుకు చాలా తేడా ఉందన్నారు అచ్చెన్నాయుడు. పార్టీ పుట్టి 40 ఏళ్లు అయిందని , ప్రజల హృదయాల్లో పుట్టినపార్టీ టీడీపీ అని ఆయన చెప్పారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్య టీడీపీ అని అన్నారు.
రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే రాష్ట్రం షేక్ అయిందని అన్నారు ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే ఆ జిల్లా దద్దరిల్లింది అని పేర్కొన్నారు.