telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పండుగ రోజున .. రక్తసిక్తమైన శ్రీలంక.. 137 మృతి.. 200 క్షతగాత్రులు..

serial bomb blasts in srilanka capital 42 died

శ్రీలంక రాజధాని కొలంబో ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ రోజు రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. మూడు చర్చ్ లు, రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో సుమారు 137 మంది వరకు మృతి చెందగా, 200 మందివరకు క్షతగాత్రులు కాగా, మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

పేలుడు తొలుత బట్టికలోవా ప్రాంతంలోని ఓ చర్చ్ లో సంభవించింది. ఆపై, హోటల్ షాంగ్రీ లా, హోటల్ సినామోన్ గ్రాండ్ లో కూడా పేలుళ్లు చోటుచేసుకునాన్నాయి. ఆపై సెయింట్ ఆంథోనీ ప్రార్థనామందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చ్ ల్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనల్లో ఉండగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాలు క్షతగాత్రులతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి ముఖ్యంగా, ఓ వ్యక్తి కదలిక లేకుండా పడివుండగా, పక్కనే ఓ చిన్నారి అత్యంత దీనంగా ఏడుస్తున్న దృశ్యం .. అందరినీ కలచివేస్తోంది.

Related posts