telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇందిరా గాంధీ సమర్థవంతమైన నాయకురాలు: రాహుల్

rahul indira

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఢిల్లీలో ఆమె సమాధి ఉన్న శక్తిస్థల్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు దర్శిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు ఆమె సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆమె దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ ఆమె ఓ గొప్ప నాయకురాలని అన్నారు. ఆమె శక్తిమంతమైన, సమర్థమైన నాయకురాలని భారత్ ను దృఢమైన దేశంగా తీర్చిదిద్దడంలోకీలక పాత్ర పోషించిన ఐరన్ లేడీ అని ట్వీట్ చేశారు. తమ ప్రియతమ నానమ్మ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నానని చెప్పారు.

Related posts