telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఖైదీలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

cm jagan

జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక కేసుల్లో ఉన్న వారిని విడుదల చేస్తున్నట్టు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. క్షణికావేశంలో చేసిన నేరంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారని..వారిలో సత్‌ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు..జైళ్లలో ఉన్న వారికి కుట్టు, ఎంబ్రాయిడరీ, అల్లికలు వంటి చేతి వృత్తులను నేర్పిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌ విడుదల చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు..దీనికి చెందిన కసరత్తుకు ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయంతో జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts