హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి అనుచరులమని చెప్పి వీరంగం సృష్టించారు. నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో కొందరు గాయపడటంతో వారి బంధువులు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే విధుల్లో ఉన్న డాక్టర్ వెంటనే కేసు అటెండ్ చేయకపోవడంతో బంధువులు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ డ్యూటీలో ఉన్న డాక్టర్ పై దాడికి దిగారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమవారిని నిమ్స్ కు తీసుకొచ్చినా వైద్యులు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తాము వెంటనే చికిత్స ప్రారంభించాలని కోరినా పట్టించుకోలేదని స్పష్టం చేశారు. తాము మంత్రి అనుచరులమని చెప్పిన యువకుడు, తన సహచరులతో కలిసి డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చేయి చేసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వీరిని స్టేషన్ కు తరలించారు. డాక్టర్ వద్ద నుంచి ఫిర్యాదు అందకపోవడంతో తాము కేసు నమోదుచేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
పృథ్వీ షా పై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు…