హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ లో శనివారం అర్ధరాత్రి ఓ యువతి హల్చల్ చేసింది. పీకలదాకా మద్యం సేవించిన యువతి కేబీఆర్ పార్క్ వద్ద నానా హంగామా చేసింది. మద్యం మత్తులో రోడ్డుపై వస్తూ పోతున్న వాహనాలపై రాళ్లతో దాడికి యత్నించింది. దీంతో వాహనదారులు అటుగా వెళ్లాలంటే తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నడిరోడ్డుపై ఈ వ్యవహారం సుమారు గంటన్నరపాటు జరిగినట్లు సమాచారం. ఈ గొడవ జరుగుతుండగానే పోలీసులు ఘటనాస్థలికి రావడంతో యువతి వారితో వాగ్వాదానికి దిగింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా తప్పించేనుకునేందుకు యత్నించింది. ఎట్టకేలకు ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు.