telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారికే ఓటేయ్యండి…పోసాని రిక్వెస్ట్‌

జీహెచ్‌ఎసీ ఎన్నికలపై పోసాని కృష్ణ మోహన్‌ స్పందిచారు. తాను 35 ఏళ్ల నుంచి ఎంతో మంది నాయకులు, ముఖ్యమంత్రులను చూశాను.. కానీ, ఎన్టీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో మత ఘర్షణలు తగ్గాయి.. ఆ తర్వాత కేసీఆర్‌ హయాంలోనే లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు సినీ దర్శకనిర్మాత, డైరెక్టర్ పోసాని కృష్ణమురళి.. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణ మురళి… ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి గెలిపించాలని… టీఆర్ఎస్‌ అభ్యర్థిని మేయర్‌ను చేయాలని విజ్ఞప్తి చేశారు.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజాసేవ బాగానే చేస్తున్నాయన్న ఆయన.. 35 ఏళ్ల నుంచి ఎంతో మంది నాయకులు, ముఖ్యమంత్రులను చూసాను.. హైదరాబాద్ అంటేనే.. మత ఘర్షణలు వస్తాయి అని చెప్పుకునేవాళ్లు.. కానీ, ఎన్టీఆర్ సీఎం అయ్యాక మత ఘర్షణలు తగ్గాయి.. ఎన్టీఆర్ తర్వాత… కేసీఆర్ హయాంలోనే లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉందని.. మత ఘర్షణలకు తావు లేదన్నారు.. హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారు అంటే.. అది కేసీఆర్ వల్లే అన్నారు పోసాని కృష్ణ మురళి.

Related posts