జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి హైకోర్టులో ఊరట లభించింది. సొసైటీ బైలాస్లోని రూల్ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఈ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ అమర్నాథ్గౌడ్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది హైకోర్టు. నోటిఫికేషన్ విడుదలైనందున పిటిషన్ విచారణార్హం కాదన్న అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు….మెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు గెలుస్తారని, పోటీ చేసే అవకాశం అందరికీ ఉండాలన్నదే సొసైటీ ఉద్దేశమని తెలిపారు సొసైటీ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్. ఎన్నికల ప్రక్రియను సవాల్ చేయడం లేదని, నోటిఫికేషన్ కంటే ముందు ఇచ్చిన కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను మాత్రమే కొట్టేయాలని కోరారు పిటిషనర్. అయితే.. పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. ప్రొసీడింగ్స్ కొట్టేయాలన్న మధ్యంతర దరఖాస్తు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
స్నేక్ బాబు… ఏడేళ్ళు వాళ్ళ కూడు తిని కాటు వేస్తావా ? : శ్రీరెడ్డి