telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్నేక్ బాబు… ఏడేళ్ళు వాళ్ళ కూడు తిని కాటు వేస్తావా ? : శ్రీరెడ్డి

Srireddy

మెగా బ్రదర్ నాగబాబు ‘జబర్దస్త్’ కామెడీ షో నుంచి బయటికి వచ్చేసిన తరవాత ఆ షో నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వరుస వీడియోలు వదులుతున్న సంగతి తెలిసిందే. వివాదాస్పదం చేసే ఉద్దేశం తనకు లేదంటూనే మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి, షో ప్రసారమయ్యే ఈటీవీ యాజమాన్యంపై నాగబాబు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ షోలో చేసేవారికి నిర్వాహకుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది కాదని నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు. జబర్దస్త్ షోపై ఒక లాయర్ కేసు పెడితే దాని విచారణను స్వయంగా ఎదుర్కొంటోన్న శ్యాంప్రసాద్ రెడ్డి.. జబర్దస్త్ టీం లీడర్ వేణుపై దాడి జరిగితే పట్టించుకోలేదని అన్నారు. వేణు జరిగిన దాడితో టీం లీడర్లంతా భయపడ్డారని, తాను దగ్గరుండి అందరికీ ధైర్యం చెప్పానన్నారు. ఆ తరవాత షోకు సంబంధించి శ్యాంప్రసాద్ రెడ్డి, ఈటీవీ యాజమాన్యం చాలా నిబంధనలు పెట్టారని వెల్లడించారు. రాం ప్రసాద్ చావు బతుకుల్లో ఉన్నా పట్టించుకోలేదని, కార్పోరేట్ బుద్ధి చూపించారని ఆరోపించారు. శ్యాంప్రసాద్ రెడ్డి, ఈటీవీపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వాళ్లు ఏమీ స్పందించలేదు కానీ.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మాత్రం ఘాటుగా స్పందించింది. ఎప్పటిలానే నాగబాబు‌ను చులకన చేసే విధంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టింది. ‘‘స్నేక్ బాబు.. ఏడేళ్లు మల్లెమాల, ఈటీవీ పెట్టిన తిండి తిని ఫేమస్ అయ్యి, ఇప్పుడు సహాయం చేసిన వాళ్లని కాటు వేద్దామని పాము బుద్ధి చూపించావ్‌ కదరా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీలాంటి కొంతమంది.. పనికిమాలిన వాళ్లకు లైఫ్ ఇచ్చి తప్పు చేశారు’’ అని మరో పోస్టులో పేర్కొంది శ్రీరెడ్డి. అలాగే.. ‘‘శ్యాంప్రసాద్ రెడ్డి గారి చెప్పు తీసుకెళ్లి పూజ చెయ్యి.. ఆయన జోలికొస్తే నీ పాము పూస ఊడతది’’ అంటూ నాగాబాబుపై ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.

Related posts