telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

petrol bunk hyd

మన దేశంలో మొన్నటి వరకు పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పెరుగుదలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 91.27 కి చేరింది. అలాగే డీజిల్‌ ధర రూ. 81.73 కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.68గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 89.11 కి చేరింది.

Related posts