telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఇండియా టాప్‌ ఆర్డర్‌ విలవిల… ఇంగ్లండ్‌ టార్గెట్ ఎంతంటే..?

మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ-20లో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్‌ బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ముఖ్యంగా టీం ఇండియా టాప్‌ ఆర్డర్‌ విఫలంతో… నిర్ణీత ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రాహుల్‌ 1, కోహ్లీ 0, ధావన్‌ 4 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యారు. వికెట్‌ కీపర్‌ పంత్‌ 21 పరుగులు, హార్దిక్‌ పాండ్యా 19 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. అటు శ్రేయస్‌ అయ్యర్‌ 67 పరుగులు చేసి… రాణించాడు. కానీ చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నం చేసి పెవిలియన్‌కు వెనుదిరిగాడు. శ్రేయస్సు రాణించడంతో టీం ఇండియా గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆల్‌రౌండర్‌ ఆర్చర్‌ 3 వికెట్లు తీసి.. టీం ఇండియా టాప్‌ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. కాగా.. మొదట టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ టీం బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా బ్యాటింగ్‌ చేసింది.

Related posts