telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్లాక్ ఫంగస్‌ పై .. సిఎం జగన్ సంచలన నిర్ణయం

cm jagan ycp

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఈ బ్లాక్ ఫంగల్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి కొలుకున్నవారిలో ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో ఉచితంగా వైద్యం చేయాలని ఏపీ సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతే కాదు కరోనాతో తల్లిదండ్రులు మృతి చెందితే.. వారి పిల్లలను అదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ఆదేశించారు. అటు ఏపీలో మే 31 వరకు కర్ఫ్యూ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్.  

Related posts