telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం…

ఏపీలో గతంలో కొన్ని రోజుల క్రితం వరుసగా దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే, ఆ తర్వాత అలాంటి ఘటనలు వెలుగుచూడలేదు.. కానీ, తాజాగా మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేయడం సంచలనం సృష్టిస్తోంది.. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైల్వేకోడూరు టోల్ ప్లాజా దగ్గర దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేశారు దుండగులు.. సీత, రాముడి విగ్రహాలతో పాటు ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు దుండగులు.. అయితే, ఈ ఘటనలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది… మరోవైపు.. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. రైల్వేకోడూరులో ఆందోళనకు దిగాయి హిందూ సంఘాలు. గత కొంతకాలం నుంచి ఎలాంటి విగ్రహాలు ధ్వంసం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులను.. ఇప్పుడు తాజా కేసు మళ్లీ టెన్షన్ పెడుతోంది. అయితే చూడాలి మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది.

Related posts