telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆ రోజే క్విట్ బీజేపీ అనే నినాదాన్ని ఇవ్వాలి: సీపీఐ నారాయణ

CPI Narayana

భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న విధానాలపై సీపీఐ నేత నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. రాముడి పేరుతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ ఇండియా దినోత్సవం రోజే క్విట్ బీజేపీ అనే నినాదాన్ని ఇవ్వాలని అన్నారు.

ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్ర్యం వస్తే 2020 ఆగస్టు 5న స్వాతంత్ర్యాన్ని అవమానపరిచిన రోజు అని చెప్పారు. గాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త గాడ్సేని బీజేపీ ఆదర్శంగా తీసుకోవడం సిగ్గుచేటన్నారు. విదేశీయులను పారదోలాలని ఉద్యమం చేసి..ఇప్పడు విదేశీసంస్థలను ఆహ్వానించడం ఏంటి? అని నారాయణ ప్రశ్నించారు.

Related posts