telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

amith shah bjp

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చిందని బీజేపీ నేత మనోజ్ తివారీ వెల్లడించారు. అమిత్ షా గతం వారం రోజులుగా గురుగ్రామ్ లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

కరోనా పాజిటివ్ వచ్చిన మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షా తనకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనను కలిసినవారిని ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.

Related posts