చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అజింక్య రహానే సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం ఫ్యాన్స్ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసీస్ గడ్డపై భారత యువ ఆటగాళ్లు అందరూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే తాజాగా మార్కస్ హారిస్ మాట్లాడుతూ… ‘గబ్బా టెస్ట్ ఆఖరి రోజు ఆట అద్భుతం. ఆశ్చర్యం కూడా. భారత్ పరుగులు చేస్తుందా? లేదా వికెట్లను కాపాడుకుంటుందా? అని ఎంతో ఆలోచించాం. కానీ రిషబ్ పంత్ ఆ రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజమైన హీరో మాత్రం చతేశ్వర్ పుజారానే. ఆసీస్ బౌలర్లను అతడే అడ్డుకున్నాడు. ఎన్నో సవాళ్లను అధిగమించాడు. పుజారా ఆస్ట్రేలియన్లా ఆడినట్టు నాకు అనిపించింది. ఛాతిపైకి వచ్చిన బంతుల దెబ్బలు తగిలినా భయపడలేదు. అతడి ఆధారంగానే మిగతా వాళ్లు బ్యాటింగ్ చేశారు’ అని అన్నాడు. ‘రిషబ్ పంత్ ఇన్నింగ్స్ మాత్రం నమ్మశక్యం కానిది. అతడిలో ఏదో ఇంద్రజాలం ఉందని అంతా అంటారు. చాలాసార్లు అతడూ దానిని ప్రదర్శించాడు. ఆ సిరీస్ ఓడిపోవడం మాకు నిరాశ కలిగించింది. కానీ కొన్నిసార్లు క్రికెట్లో అవతలి వారిని అద్భుతంగా ఆడారని ప్రశంసించక తప్పదు’ అని ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హ్యారిస్ పేర్కొన్నాడు.
previous post
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని