telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వెంకటేష్ తర్వాతి సినిమా ఆ దర్శకుడితోనేనా..?

ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటించిన మూడు విభిన్న జోనర్ చిత్రాలు నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాల విడుదల గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది. ఈ చిత్రం లాక్డౌన్ పూర్తయిన వెంటనే తెరపైకి రానుంది. నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానున్నాయి. అయితే తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. కేర్ ఆఫ్ కాంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహాతో వెంకీ ఓ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వెంకటేష్ మహా ఇటీవల ఈ సీనియర్ హీరోను ఒక కథతో మెప్పించాడట. లాక్డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హీరో రాజశేఖర్‌తో కలిసి వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న “మర్మాణువు” చిత్రం ఈ ఏడాది చివర్లో తెరపైకి రానుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది.

Related posts