అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. నిన్న ఒక్క రోజే 26,398 కేసులు నమోదు కాగా, 1,703 మంది మరణించారు. బ్రెజిల్లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. భారత్లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది.
స్పెయిన్లో 217 మంది, బ్రిటన్లో 428 మంది, ఇటలీలో 262 మంది, బ్రెజిల్లో 835 మంది, ఫ్రాన్స్లో 351 మంది మెక్సికోలో 294 మంది, కెనడాలో 170 మంది కరోనా కాటుకు బలయ్యారు. అమెరికాలో మొత్తంగా 86,900 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.