ఏక్నాథ్ గైక్వాడ్ ముంబయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం మిలింద్ డియోరా కూడా ముంబయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుండి వైదొలిగారు. ఆ స్థానంలో ఏక్నాథ్ను కాంగ్రెస్ నియమించింది.
మిలిండ్ స్థానంలో ముంబయి రీజనల్ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్సిసి) యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎంఆర్సిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న ఏక్నాథ్ గైక్వాడ్ను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపింది.. అని పార్టీ ప్రకటన చేసింది. అదేవిధంగా గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన మిలింద్ కూడా అభినందనలు తెలిపింది.
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా