ఏపీలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కాకినాడలో కానిస్టేబుల్ ను తిట్టారన్న కోపంతో మందుబాబులను నడిరోడ్డు పై చితకబాదారు. కింద పడేసి బూటుకాళ్లతో తన్నారు. సర్పవరంలో ఇద్దరు వ్యక్తులు తాగి వాహనం నడుపుతూ కారును ఢీకొట్టారు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను తిట్టారు మందుబాబులు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్ ఈ విషయాన్ని ఎస్ఐకి చెప్పాడు. వెంటనే ఆ యువకులను పట్టుకోవాలని ఎస్ఐ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని పట్టుకుని చితకబాది పోలీస్ స్టేషన్కు తరలించారు. కారులో ఉన్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొత్తంగా ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైది.. పోలీసులు మరీ ఇంతలా రెచ్చిపోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వారు మద్యం మత్తులో మాట్లాడితే… పోలీసులు కూడా మద్యం మత్తులోనే విధులు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం లో ఉండి ఇలా ఎలా ప్రవర్తిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post