నెల్లూరు : 15 ఏళ్ల బాలిక సీఎం జగన్ కు లేఖ రాసింది. మా అమ్మ చనిపోయిన 40 రోజులైంది ఇంకా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ లేఖ ఉంది. మేన మామ ఆర్షిత్ రెడ్డి సహాయంతో డెత్ సర్టిఫికెట్ కోసం లేఖ రాసింది.
లేఖలో ముఖ్యమైన పాయింట్..
పంచాయతీ సెక్రెటరీ కి అర్జీ పెట్టుకుంటే మీ అమ్మ నెల్లూరులో చనిపోయింది నేను డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేను అని సమాధానం చెప్పారు…
పురపాలక సంఘం నుంచి డెత్ సర్టిఫికెట్ రావాలని ఒక్కసారి చెబుతారు
మరోసారి డాక్టర్ డెత్ సర్టిఫికెట్ పంచాయతీ కార్యాలయానికి వచ్చే వరకు ఆగాలని చెబుతారు…
నా తల్లి అనుపమ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసి నా భవిష్యత్తుకు సహకరించాలని అని లేఖ ముగించారు.