సింగూరు, మంజీరా నీటి తరలింపును అడ్డుకోలేకపోయారని టీఆర్ఎస్ నేతలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.గోదావరి నదీ జలాలను సంగారెడ్డికి తీసుకురాలేకపోయారంటూ టీఆర్ఎస్ నేతలపై ద్వజమెత్తారు. గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి సంగారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. అవగాహనలేని నేతలు సంగారెడ్డిలో ఉండడం దురదృష్టకరమంటూ స్థానిక టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను జగ్గారెడ్డి తిప్పికొట్టారు. ఎవరు కబ్జాలు చేశారో, ఎవరు ఎవరిని ముంచారో తెలుసుకునేందుకు చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంగారెడ్డికి క్షణాల్లో నీళ్లు తెచ్చేవాడినని జగ్గారెడ్డి పేర్కొన్నారు.