బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గంగూలీ అన్న స్నేహాశిశ్ గంగూలీకి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉన్న సౌరభ్ హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లారు.
గంగూలీ సుమారు 10 రోజులుగా హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా నెగెటివ్గా తేలింది. గంగూలీ అన్న స్నేహాశిశ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ