రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తున్నారని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం న్యూ పోచంపహాడ్లో అక్కాపూర్ క్లస్టర్ రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భూమి పూజ చేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న దాతలను ఆదుకునేందుకే రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పదకాలు ప్రవేశ పెట్టి ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
ప్రభుత్వం సూచించిన పంటలు వేసి రైతులు ఆర్దికంగా బలపడాలని అన్నారు. రైతులందరూ ఒక చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి రైతువే దికను నిర్మల్లో ప్రారంభించనున్నామని తెలిపారు.