telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన రామ చందర్ రావు…

ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు వేయడానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై పంచ్ వేస్తూ… నేను ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని వచ్చాను అని అన్నారు. అయితే దీనికి కౌంటర్ వేస్తూ నేను ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి ఎల్లాస్వామికి మొక్కి ఎమ్మెల్సీ ఓటు వేశాను అని బీజేపీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, పీఆర్సీ త్వరగా రావాలని దేవుడికి మొక్కుకుని వచ్చాను. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వస్తాయని ఆశిస్తున్నాను. నా విజ్ఞప్తి మేరకు ఆదివారం పోలింగ్ నిర్వహిస్తోన్న ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు. శ్రమ అనుకోకుండా పట్టభద్రులు తమ ఓటును తప్పకుండా వినియోగించుకోవాలి. తొలి గంటలో మాత్రమే పోలింగ్ స్టేషన్ల వద్ద కొంత ఒత్తిడి ఉంటోంది. ఏడేళ్ళుగా తెలంగాణలో యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు అని అన్నారు. అయితే చూడాలి మరి మళ్ళీ దీని పై కేటీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది.

Related posts