ఏపీ రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు నేడు 70వ రోజుకు చేరుకున్నాయి. నిరసనల్లో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం వరకు మానవహారంగా ఏర్పడ్డారు. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 70వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి.
మరోవైపు మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో ధర్నాలు చేపట్టారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.