telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ వంటకాలను పరిశీలించిన మోదీ

హైదరాబాద్​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు.

ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన యాదమ్మ నేతృత్వంలో తయారు చేసినవంటలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  స్వయంగా పరిశీలించారు.  ఏమేం వడ్డిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాల గురించి బీజేపీ నేతలు ప్రధానికి వివరించారు.

తెలంగాణ వంటకాలను పరిశీలించిన ప్రధాని మోదీ

శనివారం యాదమ్మ బృందం నోవాటెల్​కు చేరుకున్నప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రధాని మోదీ మూడుసార్లు డైనింగ్​హాల్​ను సందర్శించి.. కొన్ని వంటలు రుచి చూశారని.. మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన దాదాపు 1,500 మంది శాఖాహరం మాత్రమే ఏర్పాటు చేశారు.. గత మూడు రోజులుగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలను వడ్డిస్తున్నట్లు తెలిపారు.

Related posts