telugu navyamedia
క్రీడలు వార్తలు

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో అదరగొట్టిన సచిన్, యువీ…

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ చెలరేగిపోయారు. యువీ ఏకంగా ఆరు సిక్సులు బాదాడు. దాంతో భారత లెజెండ్స్‌ జట్టు 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (60), యువరాజ్ సింగ్ (52) హాఫ్ సెంచరీలు బాదడంతో టీమిండియా ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్ 147/8కే పరిమితమైంది. ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ బాల్ తో చెలరేగడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయలేకపోయారు. అయితే భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాండర్ బ్రూన్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. అయితే 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

Related posts