telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మూడునాళ్ల ముచ్చటే: ముంబై జ్యోతిష్కుడు

uddhav-thackeray-shivasena

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన సుశీల్ చతుర్వేది అనే జ్యోతిష్కుడు మాట్లాడుతూ… ఈ ప్రభుత్వానిది మూడునాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు. 6 నెలల్లో ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ కంటే ఎక్కువ కాలం పాలన సాగించలేదని చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతాయని చతుర్వేది తెలిపారు. ఇది తీవ్ర రూపం దాల్చి, చివరకు ప్రభుత్వ పతనానికి కారణమవుతుందని చెప్పారు. ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేయబోతున్న సమయం మంచిది కాదని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6.40 గంటలకు రాహు, కేతువుల మధ్య పడుతోందని, ఇది మంచి సమయం కాదని తెలిపారు.

Related posts