telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఓడిపోయిన హాకీ జట్టుకు.. గుండు కొట్టించిన కోచ్…

head shaved to hocky team by coach

ఆరోగ్యం కోసం ఆటలు ఒకనాడు, నేడు విజయం, రాజకీయం ఇదే ఆటలు. దీనితో ఓటమిపాలైన జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా, ఓటమిపాలైన హాకీ జట్టు సభ్యులకు కోచ్ గుండు కొట్టించిన ఘటన ఇందుకు ప్రధాన ఉదాహరణ. స్పోర్ట్స్ అనే పదంలోనే స్పోర్టివ్ గా ఉండాలని ఉంది.. కానీ ఆ రోజులు పోయాయి, ఇప్పుడు అన్ని రాజకీయాలే.. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో తీవ్ర కలకలం రేపింది.

వివరాలలోకి వెళితే, బెంగాల్ అండర్ -19 హాకీ టీమ్, ఇటీవల ఓ మ్యాచ్ లో ఓడిపోయింది. దాంతో కోచ్ ఆనంద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆటగాళ్లకు గుండు చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కి విమర్శలు వెల్లువెత్తడంతో బీహెచ్ఏ (బెంగాల్‌ హాకీ అసోసియేషన్) విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించినట్లు బీహెచ్‌ఏ కార్యదర్శి స్వపన్‌ బెనర్జీ ప్రకటించారు. జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో భాగంగా జబల్‌ పూర్‌ లో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగగా, బెంగాల్‌ అండర్‌–19 జట్టు 1–5 తేడాతో నామ్‌ ధారి ఎలెవన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆపై జట్టులో 18 మంది ఆటగాళ్లలో 16 మంది గుండుతో కనిపించారు. అయితే, తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవమేగానీ, గుండు చేయించుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని ఆనంద్ అంటుండటం గమనార్హం.

Related posts