telugu navyamedia
వార్తలు సామాజిక

తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా..ఒక్కరోజే 6,988 మందికి పాజిటివ్

corona vairus

తమిళనాడులో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 6,988 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 89 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,06,737కు చేరింది.

ఇప్పటి వరకు 1,51,055మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 3,409 మంది మరణించారు. ప్రస్తుతం 52,273 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తమిళనాడులోనే ఉద్దృతంగా ఉంది. 

Related posts