telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : రెచ్చిపోయిన డివిలియర్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్వెల్ కేకేఆర్ కు షాక్ ఇచ్చాడు. 49 బంతుల్లో 78 పరుగులు చేసాడు. కానీ మాక్స్వెల్ పెవిలియన్ చేరిన తర్వాత మిస్టర్ 360 డివిలియర్స్ చివర్లో రెచ్చిపోయాడు. ఆఖరి మూడు ఓవర్లలోనే 50కి పైగా పరుగులు చేసి మొత్తంగా 34 బంతుల్లో 76 పరుగులు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తిరెండు వికెట్లు, కమ్మిన్స్,ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కేకేఆర్ 205 పరుగులు చేయాలి. అయితే కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ రెచ్చిపోతాడు అనే విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తాడు అనేది.

Related posts