telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. సుప్రీంకోర్టులో పిటిషన్

chandrababu

తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను మరోసారి దాఖలు చేశారు. 2017లోనే ఆళ్ల రామకృష్టారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసినప్పటికీ… సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ లిస్టింగ్‌ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు.

.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఘటన చోటు చేసుకుంది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో పాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Related posts