telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాల్లోకి లేచిన కొద్దీ సేపట్లోనే నివాసాలపై కూలిన విమానం

Plane

ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రయాణికులతో నిండుగా ఉన్న ఓ మినీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన చిన్నపాటి విమానం ఒకటి గోమా విమానాశ్రయం నుంచి బెనీకి బయలుదేరింది. టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల గాల్లోకి లేచిన కాసేపటికే అదుపుతప్పిన ఈ విమానం.. దగ్గరలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరందరూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అంతేగాక విమానం కూలిపోయిన ప్రాంతంలో మరో నలుగురు స్థానికులు కూడా మృత్యువాతపడ్డారు. భారతీయ కాలమానం ప్రకారం ఈ అవాంఛనీయ ఘటన మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. విమానంలో వచ్చిన ఓ సాంకేతిక లోపం వల్లనే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Related posts