తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తద్వారా సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వానికి కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఇప్పటివరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్టయింది. పాత భవనాలను కూల్చి కొత్త సచివాలయం నిర్మించాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించినట్టయింది.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్