telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాస్‌ గెలిచిన బౌలింగ్‌కు దిగిన కోహ్లిసేన..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ 20 లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది కోహ్లిసేన. రెండో టీ 20కి గాయంతో దూరమైన ఆరోన్‌ ఫించ్‌.. ఈ మ్యాచ్‌కు మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌గా వచ్చాడు. ఆల్‌ రౌండర్‌ స్టాయినిస్‌ ను ఆసిస్‌ పక్కన పెట్టింది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీం ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌ మాత్రం ఆసిస్‌ జట్టుకు కీలకం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమిండియా.. మరోసారి అదే ఫామ్ కనబర్చి, ఆసిస్‌కు వైట్‌వాష్ చేయాలన్న కసితో ఉంది.

ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్‌ ఫించ్‌ {కెప్టెన్‌}, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, గ్లెన్‌ మాక్స్‌ వెల్‌, సీన్‌ అబోట్‌, ఆడం జంపా, డేనియల్‌ సామ్స్‌, షార్ట్‌, స్వెప్సన్‌, ఆండ్రూ టై,
ఇండియా జట్టు : విరాట్‌ కోహ్లి {కెప్టెన్‌}, కెఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్‌, శార్దూల్

Related posts