గ్రామ వాలంటీర్ల ఎంపికపై టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా ఎవరూ భయపడవద్దని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గ్రామ వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 18 తర్వాత గ్రామాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తారని వెల్లడించారు. ఇప్పుడు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఇతర రాష్ట్రాలే కాకుండా, అనేక దేశాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని చెప్పారు.
శ్రీలంక, మలేసియా దేశాలు కూడా సచివాలయ వ్యవస్థను పరిశీలిస్తున్నాయని వివరించారు. సీఎంగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలని అన్నారు. జగన్ లో ఆ దమ్ముందని పేర్కొనారు. అందుకే సామాజిక న్యాయంతో చట్టాలు చేయగలిగారని వెల్లడించారు. సీఎం జగన్ మాటకు కట్టుబడి మనసుతో పరిపాలన సాగిస్తున్నారని తమ్మినేని తెలిపారు.