బీజీపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్కాల్స్ వస్తున్నాయన్నదానిపై నిఘా పెట్టారు. కిషన్రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. తెలంగాణ్ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే.