telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో కూడా విద్యాసంస్థలు బంద్… కానీ..?

Adimulapu sures

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాస్జ్త్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో… తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు.  రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.  ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో విద్యాసంవత్సరాన్ని గాడిలో పెట్టినట్టు తెలిపారు.  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన విద్యాసంస్థలను వెంటనే క్లోజ్ చేయాలని అన్నారు.  పెద్ద ఎత్తున సంక్షోభం తలెత్తినపుడు కొంత నష్టం తప్పక ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.  కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Related posts