ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన మేకపాటి విక్రమ్రెడ్డి ..ఈరోజు సోమవారం ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసారు.
ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ కుటుంబంపై ప్రేమ చూపించి భారీ మెజార్టీతో గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు గౌతమ్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళతామన్నారు.
కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 20 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. రౌండ్ రౌండ్ కూ మేకపాటి విక్రమ్ రెడ్డి మెజారిటీ పెంచుకుంటూ పోయారు.
ఆజంఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జయప్రద