మనదేశంలో వెరైటీ పేర్లతో హోటళ్లు దర్శనమిస్తున్నాయి. ఫుడ్ మాట అటుంచితే హోటల్ పేర్లు గమ్మత్తుగా ఉండటంతో కస్టమర్లు కూడా ఎక్కువ మంది వస్తున్నారట. హోటల్కు ఉన్న ఫీడ్ బ్యాక్ లేకపోతే ప్రత్యేక వంటలను చూసో ఆ హోటల్ లో ఫుడ్ను తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే.. ఇది ఒకప్పటి ట్రేండ్. ఇప్ప్పుడు ఆ ట్రేండ్ పూర్తిగా మారిపోయింది. రుచిని చూసి తినడం కన్నా కూడా హోటల్ పేర్లను చూసి ఆ హోటల్ను ఎక్కువసార్లు సందర్శిస్తున్నారు. అంతేకాదు… ఫలానా హోటల్కే వెళ్లండి అని తోటివారికి చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కొత్తగా వ్యాపారంలోకి దిగుతున్న వారు కూడా యువతను ఎట్రాక్ట్ చేయడానికి వెరైటీ పేర్లను పెడుతున్నారు. తమ బిజినెస్ను కానిచ్చేస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ రెస్టారెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ దాని పేరు ఏంటో తెలుసా “పొట్ట పెంచుదాం”. సోషల్ మీడియాలో ప్రచారంజరుగుతున్న దాన్ని బట్టి ఈ రెస్టారెంట్ను రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటు చేశారట. వినడానికి కాస్త కొత్తగా ఉండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాకి ఎక్కి వైరల్గా మారింది. గతంలోనూ ఇలాంటి చాలా పేర్లు వైరల్గా మారిన విషయం తెలిసిందే…
previous post