ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ విషయం తెలిసిందే.
తాజాగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ముందు జాగ్రత్తగా ఇటీవల ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. తమ వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తాను అందరికీ ఫోన్ లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
ముత్తంశెట్టి కుమారుడు వెంకట శివసాయి నందీశ్ కు కూడా వైరస్ సోకినట్టు తేలింది. తండ్రికి పాజిటివ్ వచ్చినట్టు తెలియగానే ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ వైద్యులు ఇంట్లోనేచికిత్స అందిస్తున్నారు.
బాబు అప్పుడు హైదరాబాద్ వదిలివచ్చారు..ఇప్పుడు అక్కడికే పారిపోయారు!